Monday, April 29, 2024

ఘోర రోడ్డు ప్ర‌మాదం : న‌లుగురు మృతి, ప‌ది మందికి తీవ్ర‌గాయాలు

ఓ రోడ్డు ప్ర‌మాదంలో న‌లుగురు మృతిచెంద‌గా, మ‌రో ప‌ది మందికి తీవ్ర‌గాయాలైన ఘ‌ట‌న తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది. తమిళనాడులోని తిరుపతూర్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. కార్మికులతో వెళుతున్న వ్యాన్, లారీ ఢొకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. అంబూర్ – వేలూరు హైవే పై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు మరణించగా, పది మందికి తీవ్రగాయాలయ్యాయి. తీవ్రగాయాలైన పదిమందిలో ఆరుగురి పరిస్థిితి విషమంగా ఉందని పోలీసులు చెప్పారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరంతా షూ కంపెనీలో పనిచేసే కార్మికులుగా గుర్తించారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ఈ ప్ర‌మాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement