Thursday, April 18, 2024

విద్యుత్ ఛార్జీల పెంపుపై సీపీఐ ఆందోళన

పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని కడప ఆర్డీవో కార్యాలయం ఎదుట సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆందోళన నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ. ఆదానీ సోలార్ కంపెనీతో ప్రభుత్వం 7వేల మెగావాట్ల విద్యుత్ కోసం ఒప్పందం కుదుర్చుకున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఛార్జీపెంచారన్నారు.ఆదాని కమీషన్ల కోసం కక్కుర్తి పడి వారితో ఒప్పందాలు కుదుర్చుకున్నారన్నారు. చంద్రబాబు హయాంలో విద్యుత్ చార్జీలు పెరిగితే బాదుడే బాదుడు అన్నావని గుర్తుచేశారు. పెంచిన విద్యుత్ చార్జీలు తగ్గించే వరకు ప్రతిపక్షాలతో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలకు శ్రీకారం చూడతామని హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement