Saturday, April 27, 2024

Big Breaking: మహారాష్ట్రలో ఘోరం.. రైల్వే ఫుట్​ ఓవర్​ బ్రిడ్జి కూలి 20మందికి తీవ్ర గాయాలు, 8 మంది పరిస్థితి సీరియస్​

మహారాష్ట్ర చంద్రాపూర్‌లోని బల్లార్షా రైల్వే స్టేషన్‌లో ఘోరం జరిగింది. ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జిలో కొంత భాగం కూలిపోవడంతో పెను ప్రమాదం సంభవించింది. చాలా మంది ప్రయాణికులు వంతెనపై నుంచి దాదాపు 60 అడుగుల ఎత్తు నుంచి ట్రాక్‌పై పడిపోయారు. ఈ క్రమంలో దాదాపు 20 మంది ప్రయాణికులకు తీవ్రంగా గాయాలయ్యాయి. వీరిలో ఎనిమింది మంది పరిస్థితి సీరియస్​గా ఉన్నట్టు తెలుస్తోంది, ప్లాట్‌ఫారమ్ నంబర్ 1 నుండి ప్లాట్‌ఫారమ్ నంబర్ 4కి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement