Thursday, May 2, 2024

కూలిన ఫుట్ బ్రిడ్జి.. 40మందికి గాయాలు

ఫుట్ బ్రిడ్జ్ కూలి 40మందికి గాయాలు అయ్యాయి.బైశాఖి పర్వదినం నాడు జమ్మూకశ్మీర్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఉదమ్‌పూర్ జిల్లాలోని బేని సంగం పై నిర్మించిన ఫుట్‌ బ్రిడ్జ్ ప్ర‌మాద‌వ‌శాత్తు కూలింది. పోలీసు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. బైశాఖి పర్వదినం సందర్భంగా బేని సంగానికి పెద్ద సంఖ్యలో భక్తులు పోటెత్తారు. ఈ సందర్భంగా అక్కడ నిర్మించిన ఫుట్‌ బ్రిడ్జ్ పైకి అధిక సంఖ్యలో భక్తులు వెళ్లడంతో అది ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో చిన్నారులు సహా సుమారు 40 మందికిపైగా గాయపడ్డారు. పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఘనటకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement