Thursday, May 16, 2024

flash flash : కామారెడ్డిలో ఘోర రోడ్డుప్ర‌మాదం : ఆరుగురు మృతి

ఓ ఘోర రోడ్డుప్ర‌మాదంలో ఆరుగురు మృతిచెంద‌గా, మ‌రో ఆరుగురు గాయ‌ప‌డిన విషాద ఘ‌ట‌న తెలంగాణ రాష్ట్రంలో చోటుచేసుకుంది. రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లాలో బిచ్కుంద మండ‌లంలో ఈ ఘోర రోడ్డుప్ర‌మాదం జ‌రిగింది. బిచ్కుంద మండలంలోని శాంతపూర్ గేట్ సమీపంలో 161 వ నేషనల్ హైవే పై లారీని క్వాలిస్ వాహ‌నం ఢీకొట్టింది. ఈప్ర‌మాదంలో ఇద్దరు చిన్నారులతో సహా ఆరుగురు అక్కడిక‌క్కడే మృతిచెందగా.. మరో ఆరుగురు గాయ‌ప‌డగా, వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ ప్ర‌మాదంలో మృతిచెందిన వారు హైద‌రాబాద్ కు చెందిన వారుగా తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement