Sunday, May 19, 2024

బీజేపీ అంటేనే భయపడుతున్న కేసీఆర్ : బండి సంజ‌య్

కేసీఆర్ ప్రస్తుతం డిప్రెషన్ లో ఉన్నాడని.. బీజేపీ అంటేనే ఆయ‌న‌ భయపడుతున్నాడనీ ఆ పార్టీ ఎమ్మెల్యే లే చెప్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఇంకా బండి సంజ‌య్ సీఎం కేసీఆర్ పై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఔరంగజేబులా వ్యవహరిస్తే శివాజీలా సమాధానం చెప్తామ‌న్నారు. ఊసరవెల్లిలా కేసీఆర్ వ్యవరిస్తున్నారన్నారు. బీజేపీ నేతలను ఉరికిస్తవా ? ఎలా ఉరికిస్తవో చూస్తాం అని చెప్పారు. తమిళనాడులో ఏనుగు మొట్టి కాయలు వేసినా కేసీఆర్ కు సిగ్గు రాలేదు. నీ తుగ్లక్ పాలన వల్ల, నీ ఆనాలోచిత నిర్ణయాల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రభుత్వం ఇచ్చిన 317 జీవో తో టీచర్లు ఇబ్బందులూ పడుతున్నారు. 2018 ఆగస్ట్ 30న కొత్త రాష్ట్రపతి ఉత్తర్వులు వచ్చాయి. అప్పటి నుండి నిద్రపోయిన కేసీఆర్ ఇప్పుడు హడావుడి చేస్తున్నారు. కొన్ని ఉద్యోగ సంఘాల నేతలు సీఎం మోచేతి నీళ్లు తాగుతున్నారని, ఉద్యోగ సంఘాలు ఏడపోయారని అన్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఏడుస్తున్నారు. నోటిఫికేషన్లు ఇచ్చి ఉద్యోగాలు భర్తీ చేయకపోవటంతో నిరుద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement