Tuesday, April 30, 2024

పంజాబ్ స‌రిహ‌ద్దు వ‌ద్ద : డ్రోన్ క‌ల‌క‌లం

పంజాబ్ స‌రిహ‌ద్దు వ‌ద్ద డ్రోన్ క‌ల‌క‌లం రేపింది. ఫిరోజ్ పూర్ సెక్టార్ లో గ‌త రాత్రి డ్రోన్ సంచారాన్ని బోర్డ‌ర్ సెక్యూరిటీ ఫోర్స్ సిబ్బంది గుర్తించారు. కాగా అది చైనా త‌యారీ డ్రోన్ అని, దాన్ని కూల్చివేశామ‌ని బీఎస్ ఎఫ్ బ‌ల‌గాలు నిర్థారించాయి. అంత‌ర్జాతీయ స‌రిహ‌ద్దుకు 300మీట‌ర్ల దూరంలోనే ఈ డ్రోన్ ని కూల్చి వేసిన‌ట్టు బీఎస్ ఎఫ్ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. కాగా గ‌త కొన్ని రోజులుగా స‌రిహ‌ద్దుల వ‌ద్ద డ్రోన్ ల సంచారం అధిక‌మ‌య్యాయి. పాకిస్థాన్ వైపు నుంచి భారత గగనతంలోకి ప్రవేశిస్తున్న ఆ డ్రోన్లు భద్రతా బలగాలకు తరచుగా దర్శనమిస్తున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement