Sunday, May 5, 2024

UP : ఒకే కుటుంబంలో ఐదుగురి దారుణహత్య

ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు దారుణహత్యకు గురైన ఘటన ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో చోటుచేసుకుంది. ఆరాష్ట్రంలోని ప్రయాగ్రాజ్ జిల్లాలోని ఖవాయిపుర్ ప్రాంతంలో ఒకే కుటుంబానికి చెందిన అయిదుగురు దారుణంగా హ‌త్య‌కు గుర‌య్యారు. మృతిచెందిన అయిదుగురిలో రెండేళ్ల చిన్నారి కూడా ఉంది. బాధితుల్లో రామ్ కుమార్ యాద‌వ్‌ (52), ఆయ‌న భార్య కుసుమ్ దేవి (52), కూతురు మ‌నీషా (25), కోడ‌లు స‌విత‌ (27), మ‌న‌వ‌రాలు మీనాక్షి (2)లు ఉన్నారు. ఈ ఘ‌ట‌న‌లో అయిదేళ్ల మ‌న‌వ‌రాలు సాక్షి ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డారు. రామ్ యాద‌వ్ కుమారుడు సునీల్‌ (30) మ‌ర్డ‌ర్ జ‌రిగిన స‌మ‌యంలో ఇంట్లో లేడు. అయితే కేసు విచార‌ణ‌లో అత‌ను స‌హ‌క‌రిస్తున్న‌ట్లు పోలీసులు చెప్పారు. మృతిచెందిన వారి శ‌రీరాల‌పై మ‌ర‌క‌లు ఉన్నాయ‌ని, అంద‌రి త‌ల‌పై గ‌ట్టిగా కొట్టిన‌ట్లు తెలుస్తోంద‌ని పోలీసులు వెల్ల‌డించారు. మృత‌దేహాల‌ను పోస్టు మార్ట‌మ్ నిమిత్తం హాస్పిట‌ల్‌కు పంపారు. నేర‌స్థుల‌ను ప‌ట్టుకునేందుకు పోలీసులు ఏడు బృందాలుగా అన్వేషిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement