Saturday, May 4, 2024

Kerala: ఒకే ఇంట్లో ఐదు మృతదేహాలు..

రోజురోజుకు అత్యాచారాలు, హత్యల కేసులు పెరిగిపోతున్నాయి. తాజాగా.. కేరళలోని కన్నూర్‌లో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. ఒకే ఇంట్లో ఐదుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి. ఈ మృతదేహాలన్నీ ఇంట్లోని ఉరిలో వేలాడుతూ కనిపించాయి. దీంతో పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. పోస్టుమార్టం నివేదిక ప్రకారం.. ముగ్గురు చిన్నారుల మృతదేహాల్లో రసాయనాలు లభ్యమయ్యాయి. ప్రాథమిక విచారణలో పిల్లలు నిద్రమాత్రలు వేసుకుని చనిపోయారని తేలింది. అయితే శరీరంలో దొరికిన పదార్థం విషపూరితమైనదా కాదా అని తెలుసుకోవడానికి అంతర్గత అవయవాలను పరీక్షించాలని నిర్ణయించారు. మృతులను షాజీ (42), భార్య శ్రీజ (38), శ్రీజ పిల్లలు సూరజ్ (12), సుజిన్ (8), సుర్భి (6)గా గుర్తించారు. షాజీ, శ్రీజ గదిలో వేలాడుతుండగా.. మెట్లపై పిల్లల మృతదేహాలు కనిపించాయి. షాజీ, శ్రీజ ఒకే సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకున్నారు.

మీడియా కథనాల ప్రకారం.. శ్రీజకు షాజీ రెండో భర్త. శ్రీజ నిన్న ఉదయం 6 గంటలకు చెరుపుజ పోలీస్ స్టేషన్‌కు ఫోన్ చేసి పిల్లలను చంపేస్తానని చెప్పింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కానీ, అప్పటికే వారందరూ చనిపోయారు. అయితే వెంటనే వైద్యులను పిలిపించారు. వారు అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పెద్ద కొడుకు సూరజ్ శరీరంపై తీవ్ర గాయాలైన ఆనవాళ్లు ఉన్నాయి. శ్రీజకు షాజీ రెండో భర్త. చిన్న పిల్లలపై ఎందుకు ఇంత క్రూరంగా ప్రవర్తించిందనే విషయం తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement