Sunday, April 28, 2024

ఊరేగింపులో కాల్పులు.. ఓ వ్య‌క్తి మృతి

స‌ర‌స్వ‌తిదేవి విగ్ర‌హాన్ని నిమ‌జ్జ‌నం చేయ‌డానికి చేప‌ట్టిన ఊరేగింపులో కాల్పులు చోటు చేసుకున్నాయి.ఓ వ్యక్తి గన్ తీసి ఫైర్ చేశాడు. ప్రమాద వశాత్తు ఆ బుల్లెట్ తగిలి ఓ వ్యక్తి మరణించాడు. ఈ ఘటన బిహార్‌లోని పాట్నాలో పోలీసు హెడ్ క్వార్టర్స్ సమీపంలో ఈ ఘటన జరిగింది. మృతుడిని ధీరజ్‌గా గుర్తించారు. సరస్వతీ దేవి విగ్రహం నిమజ్జనం చేయడానికి ధీరజ్, మరికొందరు స్టూడెంట్లు గంగా నది వైపు వెళ్లుతున్నారు. సరస్వతీ దేవి విగ్రహ నిమజ్జనం చూసి తరించాలని వారంతా కేకలు వేస్తూ వెళ్లారు. ధీరజ్ జెహెనాబాద్‌కు చెందిన వాడని తెలుస్తుంది. దేవీ ఊరేగింపు ఉత్సవాల్లో భాగంగా ఓ వ్యక్తి అందులో నుంచి నాలుగు రౌండ్ల కాల్పులు జరిపాడు. అనంతరం, క్షతగాత్రుడిని ఓ హాస్పిటల్‌కు పరుగున తీసుకెళ్లారు. అక్కడే పరిస్థితులు విషమించి మరణించాడు. పోలీసులు ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేశారు. దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడి కోసం గాలింపులు జరుపుతను్నట్టు పోలీసులు వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement