Tuesday, April 30, 2024

వైన్స్ షాపులో మంట‌లు.. కోట్ల రూపాయ‌ల్లో న‌ష్టం

ఓ వైన్స్ షాపులో మంట‌లు ఎగ‌సి ప‌డ్డాయి. దాంతో లిక్క‌ర్ బాటిళ్లు పేలి పోయాయి. ఈ సంఘ‌ట‌న హ‌ర్యానా గురుగ్రామ్ సెక్టార్ 55లో చోటు చేసుకుంది. ప్ర‌మాదం జ‌రిగిన సమయంలో ఆ లిక్కర్ షాప్ మూసే ఉండటం వల్ల ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.
అగ్నిమాపక సిబ్బంది అందించిన వివరాల ప్రకారం, గోల్ఫ్ కోర్స్ రోడ్డు సమీపంలో సెక్టార్ 55 వద్ద వైన్స్ షాపులో మంటలు అంటుకున్నట్టు తమకు సమాచారం వచ్చిందని వివరించారు. వెంటనే ఆరు అగ్నిమాపక యంత్రాలు స్పాట్‌కు వెళ్లినట్టు సీనియర్ అధికారులు వివరించారు. సుమారు గంటన్నర తర్వాత మంటలు అదుపులోకి వచ్చాయని తెలిపారు. ఈ క్రమంలో ఇద్దరు అగ్నిమాపక సిబ్బందికి స్వల్ప గాయాలు అయ్యాయని అధికారులు తెలిపారు. అగ్నికి లిక్కర్ బాటిళ్లు పేలడం వల్ల వారికి గాయాలు అయ్యాయని చెప్పారు. అగ్ని ప్రమాదం ఏర్పడినప్పుడు వైన్స్ షాప్ మూసే ఉండటం వల్ల అందులో సేల్స్ మ్యాన్ లేడని వివరించారు. షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం ఏర్పడి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఈ అగ్ని ప్రమాదం కారణంగా కోట్ల రూపాయాల నష్టం వాటిల్లిందని ఫైర్ ఫైటర్ జస్బీర్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement