Saturday, April 27, 2024

Breaking: ఇంట్లో చెలరేగిన మంటలు.. ఐదుగురు సజీవదహనం

ఉత్తరప్రదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. మౌ జిల్లా షాపూర్‌లోని ఓ ఇంట్లో అర్ధరాత్రి వేళ ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ మంటల్లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సజీవ దహనమమయ్యారు. మృతుల్లో ఓ మహిళ, పురుషుడు ఉండగా మిగతా ముగ్గురు పిల్లలున్నారు. యూపీలోని మావు జిల్లాలోని షాపూర్ గ్రామంలో ఇంట్లోని స్టవ్ నుంచి మంటలు చెలరేగినట్టు ప్రాథమికంగా నిర్ధారించారు.

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, వైద్య సిబ్బంది, సహాయ బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టానికి తరలించారు. బాధితులు ఒక్కొక్కరికి రూ.4 లక్షల చొప్పున పరిహారం ప్రకటించినట్టు జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇంట్లో గ్యాస్‌ స్టవ్‌ నుంచి మంటలు చెలరేగడమే అగ్నిప్రమాదానికి కారణమని ప్రాతమికంగా నిర్ధారించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement