Thursday, May 2, 2024

ర‌ణ‌బీర్ క‌పూర్ మూవీ షూటింగ్ సెట్ లో ఫైర్ యాక్సిడెంట్-ఒక‌రు మృతి

ఈ మ‌ధ్య‌కాలంలో ప‌లు షూటింగ్స్ ల‌లో పెను ప్ర‌మాదాలు జ‌రుగుతున్నాయి. కాగా రీసెంట్ గా ల‌వ్ రంజ‌న్ సినిమా షూటింగ్ సెట్ లో అగ్నిప్ర‌మాదం జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌లో ఒక‌రు మృతి చెందారు. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ న‌టిస్తున్నారు. ముంబై అంధేరీలోని చిత్రకూట్ మైదానంలో వేసిన సెట్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. . షూటింగ్ జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే సెట్ మొత్తానికి మంటలు వ్యాప్తించాయి. ఈ ప్రమాదంలో మనీశ్ దేవాశీ అనే 32 ఏళ్ల వ్యక్తి మరణించాడు. మరికొందరు గాయపడ్డారు. ఈ అగ్నిప్రమాదంపై సమాచారం అందిన వెంటనే ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగారు. ఎనిమిది ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాద సమయంలో హీరో, హీరోయిన్లు షూటింగ్ స్పాట్ లో లేకపోవడం వల్ల వారు ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఈ చిత్రంలో రణబీర్ కపూర్ సరసన శ్రద్ధా కపూర్ నటిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement