Thursday, May 2, 2024

వృద్ధాశ్ర‌మంలో అగ్నిప్ర‌మాదం.. ఇద్ద‌రు మృతి.. మ‌రొక‌రి ప‌రిస్థితి విష‌మం

ఓ వృద్ధాశ్ర‌మంలో అగ్నిప్ర‌మాదం జ‌రిగింది.ఈ ఘ‌ట‌న‌లో ఇద్ద‌రు మృతి చెందారు. మ‌రొక‌రి ప‌రిస్థితి విష‌మంగా ఉంది. ఈ సంఘ‌ట‌న ఢిల్లీలోని గ్రేటర్ కైలాష్ II ప్రాంతంలో చోటు చేసుకుంది. ప్రస్తుతానికి మంటలు అదుపులోకి వచ్చాయి. ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. గ్రేటర్ కైలాష్ II ఇ బ్లాక్‌లో ఓ వృద్ధాశ్రమం ఉంది. ఉన్నట్టుండి ఒక్క సారిగా ఈ రోజు మంటలు చెలరేగాయి. ఈ అగ్నిప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ ఇంజన్లు అక్కడికి చేరుకున్నాయి. మంటలను ఆర్పేందుకు ప్రయత్నించాయి. అదే సమయంలో ఢిల్లీ పోలీసులు కూడా అక్కడికి చేరుకున్నారు.

భవనంలో చిక్కుకున్న వారిని రక్షించడంలో అగ్నిమాపక సిబ్బందికి సహాయపడ్డారు. అగ్నిమాపక సిబ్బంది గంటల తరబడి శ్రమించి మంటలను ఆర్పివేశారు. కాగా.. ఈ అగ్నిప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు చనిపోయారని, మరో ఆరుగురిని విజయవంతంగా రక్షించామని అగ్నిమాపక శాఖ తెలిపింది. ఈ ఘటనపై సౌత్ డిప్యూటీ పోలీస్ కమిషనర్ చందన్ చౌదరి మాట్లాడుతూ.. గ్రేటర్ కైలాష్ IIలోని సీనియర్ సిటిజన్ కేర్ హోమ్‌లో మంటలు చెలరేగాయని, ఇద్దరు మహిళలు మరణించారని తెలిపారు. ఈ ప్రమాదానికి కారణాలు ఏంటని ఇంకా తెలియరాలేదని తెలిపారు. దీనిని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement