Saturday, April 20, 2024

Breaking : భార్య గొంతుకోసిన భర్త.. కోపంలో షాకింగ్ రివేంజ్ !!

నంద్యాల జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. భార్య భర్తలు ఒకరిగొంతు మరొకరు కోసుకుని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. వారం క్రితం భార్య లక్ష్మీదేవితో గొడవపడిన భర్త ఆవేశంలో ఆమె గొంతు కోశాడు. దీంతో ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. అయితే వారం తరువాత ఈ రోజు భార్యను చూసేందుకు భర్త ఆస్పత్రికి వచ్చాడు. అప్పటికే భర్తపై కోపంతో ఉన్న ఆమె తనను చూసేందుకు వచ్చిన భర్త గొంతు కోసింది. ఈ ఉదంతం నంద్యాల సర్వజన ఆస్పత్రిలో చోటుచేసుకుంది. భర్త బ్రహ్మయ్యకి తీవ్ర గాయం కావడంతో పరిస్థితి విషమించింది. వెంటనే వైద్యులు కర్నూలు ఆస్పత్రికి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement