Friday, May 3, 2024

ఆప్ లో చేరిన కొన్ని గంట‌లే మ‌ళ్లీ కాంగ్రెస్ లోకి వెళ్లిన అలీ మెహ‌దీ

తాను కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీ కార్య‌క‌ర్త‌న‌ని ట్వీట్ చేశారు అలీ మెహ‌దీ..కాగా ఆయ‌న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)లో చేరిన కొన్ని గంటలకే కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ ఉపాధ్యక్షుడు అలీ మెహదీ మనసు మార్చుకున్నారు. శనివారం వేకువజామున తిరిగి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవ‌డం విశేషం. తనతోపాటు ‘ఆప్’లో చేరిన ముస్తాఫాబాద్‌, బ్రిజిపూర్ కౌన్సిలర్లు సబీలా బేగం, నజియా ఖాతూన్‌లు తిరిగి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నట్టు చెప్పారు.

ఆమ్ ఆద్మీ పార్టీలో చేరుతున్నట్టు మెహదీ ప్రకటించిన వెంటనే ముస్తాఫాబాద్‌లో పార్టీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మెహదీ పాములాంటోడని కాంగ్రెస్ పార్టీ యూత్ కాంగ్రెస్ సోషల్ మీడియా ఇన్‌చార్జ్ అభివర్ణించారు. ఆ తర్వాత కాసేపటికే మెహదీ తిరిగి కాంగ్రెస్‌లో చేరడం గమనార్హం. తిరిగి పార్టీలోకి వచ్చిన మెహదీకి పార్టీ నేతలు ఆన్‌లైన్ ద్వారా తమ మద్దతు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement