Wednesday, May 15, 2024

ఇద్ద‌రు కుమారైల‌పై తండ్రి ఆత్యాచారం – 21 ఏళ్ల జైలుశిక్ష, రూ.9వేల జరిమానా

క‌న్న‌కూతురిపైనే క‌న్ను వేశాడు క‌న్న తండ్రి. దాంత కూతుళ్ల‌పైనే అత్యాచారానికి పాల్ప‌డ్డాదు ఆ దుర్మార్గుడు. ఈ అమానుషం మధ్య ప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియర్ సమీపంలోకి ఓ గ్రామంలో భార్యాభర్తలు.. ఇద్దరు కూతుళ్లతో కలిసి నివాసముండేవారు. అయితే కన్న కూతుళ్లకు రక్షణగా వుండాల్సిన తండ్రే వారిపై కన్నేసాడు. కామంతో కన్నూమిన్ను కానక ఇద్దరు కూతుళ్లపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఏడాది క్రితమే పెద్ద కూతురుపై అత్యాచారానికి పాల్పడగా నెల రోజుల క్రితం ఇంట్లో నిద్రిస్తున్న చిన్న కూతురిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు ఈ కీచకుడు. అర్ధరాత్రి సమయంలో నిద్రిస్తున్న కూతురువద్దకు వెళ్లి అరవకుండా నోరు మూసి అతి క్రూరంగా అత్యాచారానికి పాల్పడ్డాడు ఈ కసాయి తండ్రి. ఈ విషయం ఎవరికీ చెప్పవద్దని బెదిరించాడు. కానీ బాలిక తల్లితో తనపై తండ్రి చేసిన అఘాయిత్యం గురించి తెలిపింది. ఈ దారుణం గురించి చెల్లి తల్లికి చెప్పిన సమయంలో అక్కడేవున్న పెద్దకూతురు కూడా తనపై జరిగిన అత్యాచారం గురించి బయటపెట్టింది. తనపై కూడా ఏడాది క్రితమే తండ్రి అత్యాచారానికి పాల్పడ్డాడని…ఎవరికీ చెప్పవద్దని బెదిరించడంతో భయంతో బయటపెట్టలేదని తెలిపింది.

కట్టుకున్నవాడే కామాంధుడిలా మారి ఇద్దరు కూతుళ్లపై అత్యాచారానికి పాల్పడటాన్ని ఆ తల్లి తట్టుకోలేకపోయింది. వెంటనే ఇద్దరు కూతుళ్లతో కలిసి ఆ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి సదరు కామాంధున్ని అరెస్ట్ చేసారు. చిన్నారులిద్దరికి వైద్య పరీక్షలు నిర్వహించగా ఇద్దరిపైనా అత్యాచారం జరిగినట్లు తేలింది. దీంతో కన్న కూతుళ్లపై అఘాయిత్యానికి పాల్పడిన కామాంధున్ని పోలీసులు కోర్టులో హాజరుపర్చారు. విచారణ జరిపిన ఫాస్ట్ ట్రాక్ కోర్టు నిందితుడికి 21 ఏళ్ల జైలుశిక్ష, రూ9వేల జరిమానా విధించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement