Tuesday, May 7, 2024

Breaking: కన్నతండ్రే కాల యముడయ్యాడు.. 19నెలల పసికందును గొంతుపిసికి చంపేశాడు

పేదరికం ఆ కుటుంబాన్ని వెక్కిరించింది. ఆ కుటుంబ పెద్దతో సహా అందరి సభ్యుల ఆరోగ్య పరిస్థితి బాగాలేదు. కుటుంబ పోషణ భారం కావడంతో కన్న కూతురిని పోషించలేని స్థితికి చేరుకునాన‌ని బావించి 19 నెలల పసికందును గొంతు నులిమి చంపేశాడో వ్య‌క్తి. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గంలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలిలా ఉన్నాయి.

రంగారెడ్ది జిల్లా షాద్ నగర్ నియోజకవర్గంలోని ఫరూక్ నగర్ మండల పరిధిలో గల బాపన్ కుంట తండాకు చెందిన నరేష్, రజిత దంపతులకు 19 నెలల క్రితం చిన్నారి ప్రియ జన్మించింది. కాగా నరేష్ కుటుంభంలో అతని భార్యతో పాటు అందరి ఆరోగ్య పరిస్థితి బాగోలేక పోవడానికి తోడు ఆర్థిక స్థితి సరిగ్గా లేకపోవడం వారి పాలిట శాపంగా మారింది. ఈ నేపథ్యంలో తన 19 నెలల కూతురు ప్రియను పెంచి పోషించలేనని బావించిన తండ్రి నరేష్ ప్రియ గొంతు నులిమి హత్య చేశాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement