Wednesday, May 1, 2024

Breaking: ఘోర రోడ్డుప్రమాదం.. 15మంది మృతి

ఘోర రోడ్డు ప్రమాదంలో 15మంది మృతిచెందగా, మరో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉన్న ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని కర్గోనే జిల్లాలో బస్సు లోయలో పడింది. ప్రమాదవశాత్తు బస్సు కర్గోనే జిల్లాలోని లోయలో పడడంతో అక్కడికక్కడే 15మంది మృతిచెందగా.. మరో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది. జిల్లాలోని ఊన్​ పోలీస్ స్టేషన్​ పరిధిలోని దాసంగ గ్రామం సమీపంలో 20 అడుగుల వంతెనపై వేగంగా వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సు.. అదుపు తప్పి నదిలో పడిపోయింది.

ఏం జరిగిందో తెలిసే లోపే బస్సులో ప్రయాణిస్తున్న వారిలో కొందరు ప్రాణాలు కోల్పోయారు. అంత ఎత్తు నుంచి పడడం వల్ల బస్సు నుజ్జునుజ్జు అయింది. ఫలితంగా లోపల ఉన్నవారు బయటకు రావడం కష్టమైంది. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే గ్రామస్థులు సహాయక చర్యలు చేపట్టి.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే ప్రభుత్వం ప్రమాద ఘటనలో మృతుల కుటుంబాలకు రూ.4లక్షల చొప్పున, క్షతగాత్రుల కుటుంబాలకు రూ.50వేల చొప్పున ఆర్థికసాయం ప్రకటించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement