Sunday, April 28, 2024

కృష్ణానదిలో గల్లంతైన ఇద్దరు యువకుల మృతదేహాలు లభ్యం

నిన్న కృష్ణానదిలో గల్లంతైన కృష్ణాజిల్లా యనమలకుదురుకు చెందిన ఇద్దరు యువకుల మృతదేహాలు లభ్యమయ్యాయి. కృష్ణానదిలో ఈతకు వెళ్లిన నలుగురు యువకులు గల్లంతయ్యారు. యనమలకుదురుకు చెందిన దాసరి రాజ్ కమల్ (16), విశ్వనాథపల్లి జీవన్ బాబు(15), చంద్ర రత్న రాకేష్ (16), జాన్ బనియన్(16) వీరిలో ఇద్దరు యువకులు రాత్రి గల్లంతైన విషయం తెలిసిందే.

ఈరోజు ఉదయం తాడేపల్లి పోలీసులు కృష్ణానదిలో గాలింపు చర్యలు చేపట్టి చంద్ర రత్న రాకేష్, జాన్ బనియన్ ల మృతదేహాలను పోలీసులు గుర్తించారు. మృతదేహాల్ని మంగళగిరి మార్చురీకి తరలించి, తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement