Sunday, April 28, 2024

Karimnagar: ధాన్యం కుప్ప వద్దే ప్రాణం విడిచిన మరో రైతు

తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లలో జరుగుతున్న జాప్యంతో ప్రాణాలు వదిలేస్తున్నారు. ఇటీవల కామారెడ్డి జిల్లాలో కొనుగోలు కేంద్రం వద్ద గుండెపోటుతో రైతులు మృతి చెందిన ఘటన మరవక ముందే.. తాజాగా అదే తరహా మరో విషాదం చోటు చేసుకుంది. కరీంనగర్ జిల్లాలో తన ధాన్యాన్ని అమ్ముకోవడానికి వచ్చిన ఐలేష్ (50) అనే రైతు ధాన్యం కుప్పపైనే గుండెపోటుతో ప్రాణాన్ని విడిచారు. ఈ హృదయ విధారక ఘటన జమ్మికుంట మండలం అబాదీ జమ్మికుంట ఐకెపి కేంద్రంలో మంగళవారం చోటుచేసుకుంది. ఈ ఘటనపై సంబంధిత అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని విచారిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement