Tuesday, April 30, 2024

రైతుల‌ను స‌న్మానించ‌నున్న శిరోమ‌ణి గురుద్వారా ప్ర‌బంధ‌క్ క‌మిటీ

రైతు సంఘాల నేత‌ల‌ను స‌గ‌ర్వంగా గౌర‌వించాల‌ని శిరోమ‌ణి గురుద్వారా ప్ర‌బంధ‌క్ క‌మిటీ నిర్ణ‌యించింది. ఎస్ జీపీసీ అధ్య‌క్షుడు హ‌ర్జింద‌ర్ సింగ్ ధామి నేతృత్వంలో మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ మీటింగ్ ఎగ్జిక్యూటివ్ క‌మిటీలో ఈ విష‌య‌మై చ‌ర్చించి నిర్ణ‌యం తీసుకున్నారు. మూడు వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా ఢిల్లీ స‌రిహ‌ద్దుల్లో ఏడాదికి పైగా ఉద్య‌మం చేసి విజ‌యం సాధించి ప్ర‌త్యేక ప్రార్థ‌న‌ల నిమిత్తం గోల్డెన్ టెంపుల్ కు విచ్చేయ‌నున్నారు రైతులు. ఈ మేర‌కు గోల్డెన్ టెంపుల్ ఆవరణలోని ఇన్ఫర్మేషన్ సెంటర్ వద్ద డిసెంబర్ 13న రైతు సంఘాల నేతలను సత్కరించనున్నట్టు ధామి వెల్ల‌డించారు. రైతుల ఆందోళనలకు ఎస్‌పీజీసీ మద్దతు తెలిపింది. భవిష్యత్తులో కూడా కర్షకులకు మద్దతుగా నిలుస్తామని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement