Tuesday, April 30, 2024

Big Story: డ్ర‌గ్స్ డెన్‌లుగా మూత‌ప‌డ్డ‌ ఫ్యాక్ట‌రీలు.. అడ్డుక‌ట్ట వేయ‌డంపై ప్రభుత్వం ఫోకస్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: మత్తు చిత్తు చేసేందుకు మూతపడిన రసాయన పరిశ్రమలపై ప్రభుత్వం దృష్టిసారించింది. అసాంఘిక కార్యక్రమాలపై డేగ కన్ను మోపుతోంది. ఇప్పటికే గుడుంబా రహిత రాష్ట్రంగా ఖ్యాతి గడించిన తెలంగాణ రాష్ట్రాన్ని మాదక ద్రవ్యాలు, గంజాయి, ప్రమాదకర రసాయనాలు పట్టిపీడిస్తున్నాయి. గంజాయి, డ్రగ్స్‌ రహిత రాష్ట్రంగా ఎదగాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని గండి కొడుతున్నాయి. రాష్ట్రంలో మూతపడిన పారిశ్రామిక వాడల్లోని పాత పరిశ్రమలే కేంద్రంగా నిషేదిత రసాయనాలు ఉత్పత్తి అవుతున్నాయి.

జీడిమెట్ల, పటాన్‌చెరు, జిన్నారం, చౌటుప్పల్‌, మెదక్‌లతోపాటు పలు ప్రాంతాల్లోని పరిశ్రమల్లో కొత్త రకం డ్రగ్స్‌ ఉత్పత్తి కేంద్రాలుగా వెలుగొందుతున్నాయి. ఆయా ప్రాంతాల్లో నిషేదిత డ్రగ్స్‌ తయారీదారులు, స్మగ్లర్లు ఇప్పుడు కెమిస్ట్రీలో ఉన్నతస్థాయికి ఎదిగినవాళ్లే ఉంటున్నారు. తాజా సమాచారం నేపథ్యంలో ఎఫిడ్రిన్‌, కెటెమైన్‌, ఇతర మాదక ద్రవ్యాలపై ప్రభుత్వం తాజాగా దృష్టిసారించింది.

గంజాయి, కొకైన్‌, ఓపియం, ఎల్‌సిడి, హెరాయిన్‌లతోపాటు ప్రాణాలు నిలిపే మందులు తయారయ్యే ఎఫిడ్రిన్‌, కెటమైన్‌, మెఫిడ్రిన్‌, వంటి ఘాటైన, గంటలపాటు మనిషిని మత్తులో ఉంచే రసాయనాల డ్రగ్స్‌ కూడా మాదకద్రవ్యాల ఒరవడిలోకే వస్తాయి. అయితే గంజాయి, ఓపియం దేశంలో అనేకచోట్ల దొరుకతుండగా, గంజాయిపంట నుంచి నాణ్యమైన సురుకును వేరుచేసి దాన్ని మరింత నాణ్యంగా మారిస్తే నల్లమందు తయారవుతోంది. ఇందులో కొంత ఘాటుగా ఉండేది హెరాయిన్‌గా చెప్తారు. కాగా కొకైన్‌, ఎల్‌ఎస్డిలు దేశంలో దొరకవు, వీటిని వీటిని విదేశాల నుంచి దొంగచాటుగా దేశంలోకి తీసుకొస్తున్నారు.

విదేశాలనుంచి తరలించడం కష్టంగా మారడంతోపాటు, నిఘా తీవ్రం కావడంతో స్థానికంగా మత్తు మందులను తయారు చేసేందుకు కొన్ని పారిశ్రామిక రసాయన పరిశ్రమలు అడ్డాలుగా మారియ. కొందరు శాస్త్రవేత్తలు, ఫార్మసిస్టులు ఇలా బృందాఉలగా ఏర్పడి మూతపడిన రసాయన పరిశ్రమలను లీజుకు తీసుకుని ఎఫిడ్రిన్‌, కెటమైన్‌, మెఫిడ్రిన్‌ వంటి ఎక్కువ విలువైన మత్తు మందులను తయారు చేస్తున్నారు. ఇందుకు కొన్ని రోగాలకు వాడే ఔషదాలను, రసాయనాలను కలిపి వీటిని స్థానికంగా తయారు చేస్తోన్నారు.

ఈ మందులను అధికంగా వినియోగిస్తే తొలుత ఉల్లాసంగా, మత్తుగా అనిపించినా ధీర్ఘకాలికంగా నీరసం, ఇతర జబ్బులు, నాఢీ వ్యవస్థ దెబ్బతినడం వంటి దుష్పరిణామాలు సంభవిస్తాయి. ఆ తర్వాత మరణం కూడా సంభవించవచ్చని నిపుణులు చెబుతున్నారు. కొకైన్‌, ఓపియం, హెరాయిన్‌లతో పోలిస్తే ఎఫిడ్రిన్‌, కెటమైన్‌, మెఫిడ్రిన్‌లు చౌకగా దొరుకుతున్నాయి. వీటికి ప్రధానంగా కాలేజీ యువత బానిసలుగా మారుతోంది.

- Advertisement -

మూడంచెల వ్యవస్థతో కట్టడి…
మాదక ద్రవ్యాల కట్టడికి పోలీస్‌, ఆబ్కారీ అధికారులు మూడంచెల వ్యవస్థను రూపొందించి అనుసరిస్తున్నారు. హైదరాబాద్‌, శివారు ప్రాంతాల్లో గంజాయి, కొకైన్‌, ఎల్‌ఎస్‌డి, ఎండిఎంఏల సరఫరాదారులు, రవాణాను కట్టడి చేసేందుకు తొలి అంచెలో ప్రాధాన్యతనిస్తున్నారు. రాష్ట్రంలోకి వేర్వేరు మార్గాల ద్వారా వస్తున్న మాదకద్రవ్యాలను, తరలిస్తున్న వ్యక్తులను గుర్తింఇ అదుపులోకి తీ’సుకోవడాన్ని రెండో అంచెగా ఆయా వర్గాలు పేర్కొంటున్నాయి.

మాదక ద్రవ్యాల వినియోగం ఏఏ ప్రాంతాల్లో ఎక్కువగా ఉందో గుర్తించి ఆయా ప్రాంతాల్లో రాత్రివేళల్లో గస్తీ, నిఘా, డ్రోన్ల వినియోగంతో పహారా, తాత్కాలిక చెక్‌పోస్టుల ఏర్పాటు వంటివి మూడో అంచెలో భాగంగా అమలు చేస్తున్నారు. ఇందుకు ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేశారు. మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నా, రవానాను కట్టడి చేసినా అధికారులకు పదోన్నతులను ఇవ్వనున్నారు.

ఇక్కడే ఎక్కువ…
ప్రధానంగా హాస్టళ్లలో ఉండి చదువుకుంటున్న ఇంజీనిరంగ్‌ విద్యార్ధులు, బీబీఏ, ఎంబీఏ కాలేజీలు, హోటల్‌ మేనేజ్‌మెంట్‌ విద్యార్ధులు, టోక్నో స్కూల్స్‌, ఐఐటీ ఫౌండేషన్‌, కార్పొరేట్‌ ఇంటర్‌ కాలేజీల్లో విద్యార్ధులు ఎక్కువగా మత్తుకు బానిసలు అవుతున్నారు. అదేవిధంగా ప్రేమ విఫలమైనవాళ్లు, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు, పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నవాళ్లు, కాల్‌ సెంటర్‌ ఉద్యోగులు, రాత్రి షిఫ్ట్‌ ఉన్నవాళ్లు, వారాంతపు పార్టీ కల్చర్‌కు అలవాటైనవాళ్లు, పబ్‌లలో గడిపేవాళ్లు ఎక్కువగా మాదకద్రవ్యాలకు అలవాటు పడుతున్నారని ఆబ్కారీ శాఖ నివేదికలో పేర్కొంది. సరదాగా గోవా, కులూమనాలి, అరకు ట్రిప్‌లకు విహారయాత్రలకు వెళ్లినవాళ్లు కూడా ఈ జాఢ్యానికి బానిసలవుతున్నారు.

రాష్ట్రంలో మద్యం, నాటుసారా, గంజాయి విక్రేతలు, సరఫరాదారులు, మత్తుమందుల తయారీదారులు ఇలా ఎవరికివారుగా గుట్టుగా తమపని తాము చేసుకుపోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాలనుంచి యధేచ్చగా బహిరంగ మార్కెట్‌లోకి మందు తరలిపోతోందని పలు ప్రాంతాల్లో గుర్తించారు. కల్తీ మద్యం, కల్తీ కల్లు ఖమ్మం, నల్గొండ, మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, నిజామాబాద్‌ జిల్లాల్లో ఏరులై పారుతోందని అధికారులు గుర్తించారు. దీనిపై నిఘా పెట్టిన అధికారులు తాజాగా దాడులు తీవ్రతరం చేశారు. తాజాగా ఎక్స్‌ట్రా న్యూట్రల్‌ ఆల్కహాల్‌లకు ఇచ్చిన పర్మిషన్లను ప్రభుత్వం లెక్కతీస్తోంది. ఇక్కడ ఉత్పత్తౖన ఎక్స్‌ట్రా న్యూట్రల్‌ ఆల్కహాల్‌ అక్రమంగా ఇతరుల చేతికి చేరి నకిలీ మద్యం తయారు చేస్తున్నారనే సమాచారం అందడంతో ఈ మేరకు దృష్టిసారించారు.

ఆర్‌ఎస్‌ విక్రయాలకు ఇచ్చిన ఇండెంట్‌లు…
కంపెనీలు ఆర్‌ఎస్‌ ఉత్పాదన సామర్ద్యం ఇఎన్‌ఏ ఉత్పాదన సామర్ద్యం (లక్షల లీటర్లలో)
మెస్సర్స్‌ ఇండ్‌ భారత్‌ బయో సైన్సెస్‌, నల్గొండ 360 360
అల్‌క్రెయిన్‌ కెమికల్స్‌ ప్రై.లి. మెదక్‌ 180 180
వశిష్ట ఫెర్మెంటేషన్‌ ప్రై. లి. 240 240
నధి బయో ప్రోడక్ట్స్‌ , మహబూబ్‌నగర్‌ 198 198
గాయత్రీ స్టార్చ్‌ కెం మెదక్‌ 150 150

మధుకాన్‌ షుగర్స్‌, ఖమ్మం 180 180

మొత్తం 1308

Advertisement

తాజా వార్తలు

Advertisement