Thursday, April 18, 2024

టీటీడీ ట్రస్టులకు భారీగా విరాళాలు…

తిరుమల, ప్రభన్యూస్‌ : తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి ట్రస్టులకు భారీగా విరాళాలు అందాయి. ఈ మేరకు టీవీఎస్‌ సంస్ఠ చైర్మన్‌ సుదర్శన్‌ శనివారం ఉదయం శ్రీపద్మావతి చిన్నపిల్లల హృదలయాలకు రూ.కోటి 5 లక్షలు విరాళం అందించారు. ఇందుకు సంబంధించిన చెక్కును దాత తరపున ప్రతినిధి శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డికి అందచేశారు. అలాగే పలు టిటిడి పథకాలకు గాను శుక్రవారం రాత్రి హైదరాబాద్‌కు చెందిన భక్తులు విరాళాలు అందించారు.

ఈ మేరకు జివిఆర్‌ ఇన్ఫాృ సంస్థ తరపున బాలాజి ఆరోగ్యవరప్రసాదిని స్కీమ్‌కు ఒక రోటి 25 లక్షలు అందించగా ఎం.హరిబాబు, హస్‌వెంకటేశ్వర్లు రూ.10 లక్షల చొప్పున ఎస్వి అన్నప్రసాద పథకానికి విరాళంగా అందించారు. అదేవిధంగా ఎస్‌.రవిబాబు గో సంరక్షణ ట్రస్టుకు రూ.2.50 లక్షలు విరాళంగా అందచేశారు. వీరు ఈ వేరకు విరాళాలకు సంబంధించిన డిడిలను దాతల విభాగం కార్యాలయంలో డిప్యూటిఈవో పద్మావతికి అందచేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement