Tuesday, May 7, 2024

పేలిన ఐఈడీ.. ఐదుగురికి గాయాలు.. ఇద్ద‌రి ప‌రిస్థితి విష‌మం

శ‌క్తివంత‌మైన ఐఈడీ పేల‌డంతో ఐదుగురికి గాయాల‌య్యాయి.ఈ సంఘ‌ట‌న మణిపూర్ ఉఖ్రుల్ జిల్లాలో శ ఫుంగ్రేటాంగ్, వ్యూల్యాండ్ ప్రాంతాల మధ్య ఈ పేలుడు సంభవించిందని పోలీసులు తెలిపారు. భారీ ఇంప్రూవైజ్డ్ ఎక్స్ ప్లోజివ్ డివైజ్ (ఐఈడీ) పేలుడులో ఐదుగురికి గాయాలయ్యాయి. ఉఖ్రుల్ జిల్లాలోని ఫుంగ్రేటాంగ్, వ్యూల్యాండ్ ప్రాంతాల మధ్య ఈ పేలుడు సంభవించినట్లు పోలీసులు తెలిపారు. క్షతగాత్రుల్లో ఐదుగురు మణిపురేతరులు ఉన్నారు. గాయ‌ప‌డిన వారిలో నలుగురు దుకాణదారులు, ఒక బండి పుల్లర్ ఉన్నారని అధికార వ‌ర్గాలు తెలిపాయి. క్ష‌త‌గాత్రుల‌ను వెంటనే చికిత్స నిమిత్తం ఉఖ్రుల్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ ఐఈడీ పేలుడులో ముగ్గురు ప్రాణాపాయం నుంచి బ‌య‌ట‌ప‌డ్డార‌ని పోలీసులు తెలిపారు. ఇద్ద‌రి ప‌రిస్థితి విష‌మంగా ఉంది. బీహార్ కు చెందిన సంజయ్ కుమార్ ప్రసాద్, మంగళ్ మహతన్ లను ప్రత్యేక చికిత్స కోసం ఇంఫాల్ లోని ఆసుపత్రికి తరలించారు. వీరి వీపు, కాళ్లకు తీవ్ర‌ గాయాలయ్యాయనీ, వారి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement