Saturday, April 27, 2024

ఎస్ఐ పై ఎర్ర‌చంద‌నం స్మ‌గ్ల‌ర్ల దాడి..

ఎర్ర‌చంద‌నం స్మ‌గ్ల‌ర్ల‌ను ప‌ట్టుకునేందుకు ప్ర‌య‌త్నించిన ఎస్ఐ కారును స్మ‌గ్ల‌ర్లు త‌మ కారుతో ఢీకొట్ట‌డంతో ఎస్ఐకి గాయాలైన ఘ‌ట‌న ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని రాపూరు అటవీ ప్రాంతం నుంచి స్మగ్లర్లు కారులో ఎర్రచందనం తరలిస్తున్నట్లు స్థానిక ఎస్సైకి సమాచారం తెలిసింది. డక్కిలి మీదుగా తిరుపతి హైవే వైపు వెళ్తున్నట్లు తెలియడంతో డక్కిలి ఎస్సై నాగరాజుకు రాపూరు పోలీసులు సమాచారమిచ్చారు.

వెంటనే స్మగ్లర్లను వెంబడించేందుకు డక్కిలి పోలీసులు బయల్దేరి స్మగ్లర్లను అడ్డగించారు. దీంతో స్మగ్లర్లు పారిపోయేందుకు యత్నించగా.. పోలీసులు ఛేజింగ్‌తో వారిని పట్టుకునేందుకు వెళ్లారు. ఈ క్రమంలో స్మగ్లర్లు తమ కారుతో పోలీసు వాహనంపైకి దూసుకెళ్లి ఢీకొట్టారు. అనంతరం దుండగులు తమ కారును అక్కడే వదిలేసి పారిపోయారు. స్మగ్లర్ల కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో డక్కిలి ఎస్సైకి ముఖంపై గాయాలయ్యాయి. వెంకటగిరిలో ప్రాథమిక చికిత్స అనంతరం ఎస్ఐని నెల్లూరులోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement