Sunday, April 28, 2024

మేఘాలయ కాంగ్రెస్ లో సంక్షోభం.. టీఎంసీలో చేరిన మాజీ సీఎం

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మేఘాలయ మాజీ సీఎం ముకుల్ సంగ్మా కాంగ్రెస్ కు రాజీనామా చేశారు. తృణమల్ కాంగ్రెస్ అధినేత్రి, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సమక్షంలో టీఎంసీలో చేరారు. ముకుల్ తో పాటు 12మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా టీఎంసీలో చేరారు. మరో మూడు నెలల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ కు కోలుకొని దెబ్బ తగిలింది. అధికార బీజేపీని ఈ సారి ఎలాగైనా ఢీ కొట్టి అధికారంలోకి రావాలని టీఎంసీ గట్టిగా ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగానే అటు అధికార పార్టీ బీజేపీ, ఇటు కాంగ్రెస్ పార్టీ నేతలను పార్టీలోకి ఆహ్వానిస్తోంది. మమత వ్యూహాలు ఏ మేరకు ఫలిస్తాయో వేచి చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement