Thursday, May 2, 2024

Breaking : మ‌ద్యం మ‌త్తులో యువ‌తిపై అత్యాచార‌య‌త్నం..అంతా సాప్ట్ వేర్ ఉద్యోగులే..

రాను రాను మ‌హిళ‌ల‌పై అకృత్యాలు ఎక్కువ‌వుతున్నాయి. ఒక ప‌క్క శిక్ష‌లు ప‌డుతున్నా జ‌రిగేవి మాత్రం జ‌రుగుతూనే ఉన్నాయి. ఒక యువ‌తిపై ముగ్గురు సాప్ట్ వేర్ ఇంజినీర్లు అత్యాచార‌య‌త్నం చేశారు. ఈ సంఘ‌ట‌న చెన్నైలో చోటు చేసుకుంది. అన్నాసాలైలోని స్టార్ హోటల్ లో మందుపార్టీలో పాల్గొని వీరంతా పీక‌ల వ‌ర‌కు తాగార‌ని పోలీసులు వెల్ల‌డించారు. తెల్లవారుజామున కారులో హోటల్ నుంచి బయల్దేరారు.

కారులోనే యువ‌తి పట్ల యువకులు లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. దీంతో ఆమె కేకలు వేస్తూ… వారిని చొప్పుతో కొడుతూ వచ్చింది. ఆ సమయంలో అక్కడే గస్తీ తిరుగుతున్న పోలీసులు దీన్ని గమనించి కారును ఆపారు. ఆమెతో పాటు అందరూ తాగి ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుపై థౌజండ్ లైట్స్ మహిళా పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ముగ్గురు యువకులు వేలూరు జిల్లాకు చెందినవారు. దురైపాక్కంలోని ఓ ఐటీ కంపెనీలో పని చేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement