Tuesday, May 14, 2024

మృతుల కుటుంబాల‌కి రూ.25ల‌క్ష‌ల ఎక్స్ గ్రేషియా – సీఎం జ‌గ‌న్

పోర‌స్ ఫ్యాక్ట‌రీ అగ్రిప్ర‌మాదంలో మృతి చెందిన వారికి సంతాపం ప్ర‌క‌టించారు సీఎం జ‌గ‌న్. మృతుల కుటుంబాల‌కు త‌న సానుభూతి తెలిపారు. కాగ ఈ ప్ర‌మాదంలో గాయ పడిన వారంద‌రికీ మెరుగైన వైద్య సాయం అందించాల‌ని సంబంధిత అధికారుల‌ను సీఎం వైఎస్ జ‌గ‌న్ ఆదేశించారు. ఈ అగ్ని ప్ర‌మాదంలో మ‌ర‌ణించిన వారి కుటుంబాల‌కు రూ. 25 ల‌క్షల ఎక్స్ గ్రేషియా ను సీఎం వైఎస్ జ‌గ‌న్ ప్ర‌క‌టించారు. తీవ్రంగా గాయ‌ప‌డ్డ వారికి రూ. 5 ల‌క్షలు, గాయప‌డ్డ వారికి రూ. 2 ల‌క్షలు ప‌రిహారం చెల్లిస్తున్నట్టు ఆయ‌న వెల్ల‌డించారు. ఈ అగ్ని ప్ర‌మాదం ఘ‌ట‌న పూర్తి స్థాయి లో ద‌ర్య‌ప్తు చేయాలని ఏలూర్ జిల్లా కలెక్ట‌ర్, ఎస్పీల‌ను సీఎం వైఎస్ జ‌గ‌న్ ఆదేశించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement