Tuesday, May 7, 2024

ఈటెల పదవిపై వేటు… గవర్నర్ ఆదేశాలు

తెలంగాణ మంత్రి ఈటెల రాజేందర్ పై భూ ఆక్రమణ ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈటెల రాజేందర్ కూడా సీఎం కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా ఇప్పుడు అందరు ఊహించినట్టుగానే ఈటెల రాజేందర్ ను పదవి నుండి తప్పించారు. ఈటెల వద్ద ఉన్న వైద్య ఆరోగ్య శాఖ ను సీఎం కేసీఆర్ కు బదిలీ చేస్తున్నట్లు గవర్నర్ తమిళిసై కార్యాలయం నుంచి అధికారికంగా ప్రకటించింది.

సీఎం కేసీఆర్ సూచనల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు గవర్నర్ కార్యాలయం అధికారులు తెలిపారు. ఇక ప్రస్తుతం ఈటెల రాజేందర్ ఏ శాఖ లేని ఓ మంత్రి గా కొనసాగనున్నారు. ఇటువంటి సమయంలో ఈటెల రాజేందర్ రాజీనామా చేస్తారా లేదా అనేది కీలకంగా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement