Sunday, May 12, 2024

జమ్ము కశ్మీర్​ షోపియాన్​లో ఎన్‌కౌంటర్‌.. టెర్రిరిస్టు హతం!

జమ్ముకశ్మీర్‌లోని షోపియాన్‌ జిల్లాలో జరిగిన ఎన్​కౌంటర్​లో హైబ్రిడ్‌ టెర్రరిస్టుని భద్రత బలగాలు హతమార్చాయని కశ్మీర్​ జోన్​ పోలీసులు తెలిపారు. ఇంతకుముందు అరెస్టయిన ఇమ్రాన్‌ బషీర్‌ అనే టెర్రరిస్టు వెల్లడించిన వివరాల ఆధారంగా షోపియాన్‌లోని నౌగామ్‌ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ఉగ్రవాదులు, భద్రతా దళాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.

భద్రతా బలగాలను చూసి ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఇమ్రాన్‌ బషీర్‌ చనిపోయాడని కశ్మీర్‌ జోన్‌ పోలీసులు తెలిపారు. ఘటనా స్థలంలో లభించిన పేలుడు పదార్థాలు, ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. ఆ ప్రాంతంలో యాంటీ టెర్రరిస్ట్‌ ఆపరేషన్‌ ఇంకా కొనసాగుతోందన్నారు. కశ్మీరీ పండిట్‌ను చంపిన ప్రాంతానికి సమీపంలోనే ఈ ఎన్‌కౌంటర్‌ జరగడం గమనార్హం.

Advertisement

తాజా వార్తలు

Advertisement