Tuesday, May 21, 2024

సీఎం మమతా బెనర్జీ మేనల్లుడికి ఈడీ నోటీసులు

బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు, తృణమూల్‌ కాంగ్రెస్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్‌ బెనర్జీకి బొగ్గు స్మగ్లింగ్ కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ ఈరోజు సమన్లు జారీ చేసింది. ఈ కేసులో విచారణ కోసం అభిషేక్ కు నోటీసులు ఇచ్చినట్లు ఒక అధికారి తెలిపారు. శుక్రవారం ఉదయం కోల్‌కతాలోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని కోరినట్లు ఆయన తెలిపారు.

త‌మ అధికారుల ముందు హాజరుకావాలని అభిషేక్ బెనర్జీకి సమన్లు పంపాము. అయనని విచారించడానికి ఢిల్లీ నుంచి త‌మ అధికారులు వస్తారని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. దీనిపై తృణమూల్ కాంగ్రెస్ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ కక్షపూరితంగానే అభిషేక్ ను టార్గెట్ చేసిందని ఆరోపిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement