Tuesday, April 30, 2024

వివాదంలో అక్ష‌య్ కుమార్ మూవీ-రామ్ సేతు యూనిట్ కి లీగ‌ల్ నోటీసులు

బాలీవుడ్ లో వ‌రుసగా ప‌లు చిత్రాలు ప‌రాజ‌యాల‌పాల‌వుతున్నాయి. స్టార్ హీరోల సినిమాలు సైతం డిజాస్ట‌ర్ ని మిగులుస్తున్నాయి. బాయ్ కాట్ పేరుతో ప‌లువురు హీరోల‌కి చుక్క‌లు చూపిస్తున్నారు నెటిజ‌న్స్ .ఇది ఇలా ఉండ‌గా ప్ర‌ముఖ బిజెపి నేత సుబ్ర‌హ్మ‌ణ్య‌స్వామి రామ‌సేతు చిత్రంలో వాస్త‌వాల‌ను వ‌క్రీక‌రించార‌ని లీగ‌ల్ నోటీసులు పంపారు. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, నుష్రత్ భూరూచ నటించారు. ఈ సినిమా అక్టోబర్ చివరిలో విడుదల కానుంది. అక్షయ్ కుమార్ తోపాటు, సినిమాకు సంబంధించి మరో ఎనిమిది మందికి తాను లీగల్ నోటీసులు పంపించానని స్వామి ట్విట్టర్లో ప్రకటించారు. మేథో సంపత్తి హక్కుల గురించి వారికి తెలియజెప్పేందుకే అలా చేసినట్టు ప్రకటించారు. వాస్తవాలను వక్రీకరించడం హిందీ సినిమాల‌కు అలవాటుగా మారిందని స్వామి విమర్శించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement