Saturday, May 4, 2024

అండమాన్ లో భూకంపం.. తీవ్రత 4.3గా నమోదు

అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో ఈరోజు ఉదయం స్వల్ప భూకంపం వచ్చింది. తెల్లవారుజామున 2.29 గంటల సమయంలో పోర్ట్‌బ్లేయిర్‌లో భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్‌స్కేలుపై 4.3గా నమోదయిందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ వెల్లడించింది. భూఅంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతులో భూమి కంపించిందని తెలిపింది. భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదని అధికారులు తెలిపారు. బుధవారం తెల్లవారుజామున నేపాల్‌తోపాటు ఉత్తర భారతంలోని చాలా ప్రాంతాల్లో భూమి కంపించిన విషయం తెలిసిందే. 

Advertisement

తాజా వార్తలు

Advertisement