Friday, April 26, 2024

రోడ్డుపక్కన పసికందు మృతదేహం..

హైద‌రాబాద్ః గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు రోడ్డుపై అప్పుడే పుట్టిన మగ శిశువు మృతదేహాన్ని వదలి వెళ్లారు. ఈ ఘటన బేగంపేట పోలీస్ స్టేషన్‌ పరిధిలో జరిగింది. వివ‌రాలు ఇలా ఉన్నాయి.. బేగంపేటలోని పైగా ప్యాలెస్‌ సమీపంలోని మసీద్‌- ఏ- నజీరియా వద్ద ఫుట్‌పాత్‌పై మగశిశువు మృతదేహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు వదిలివెళ్లారు. విధుల నిమిత్తం అటుగా వ‌చ్చిన జీహెచ్ఎంసీ సిబ్బంది ఆ మృత‌దేహాన్ని గుర్తించారు. వెంట‌నే పోలీసు లకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించి కేసు నమోదు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement