Thursday, May 9, 2024

రాజన్న సన్నిధిలో భక్తుల సందడి – 50 వేల మంది రాక

దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి సన్నిధిలో భక్తుల సందడి నెలకొంది. ఆదివారం సెలవుదినం కావడంతో పక్క రాష్ట్రాలతో పాటు తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి పెద్ద ఎత్తున భక్తులు స్వామివారి సన్నిధికి చేరుకున్నారు.తెల్లవారుజామున భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించి స్వామివారి దర్శనం కోసం క్యూ లైన్లలో బారులు తీరారు. స్వామివారి దర్శనం కోసం సుమారు 6 గంటల పాటు క్యూలైన్లలో వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.ఎండలు మండుతున్న నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు చేస్తున్నట్లు ఆలయ ఈవో రమాదేవి తెలిపారు. ఆదివారం రోజున సుమారు 50 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా 25 లక్షల ఆదాయం సమకూరినట్లు ఆలయ వర్గాలు వెల్లడించాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement