Monday, April 29, 2024

ప్రొద్దుటూరులో ప‌లు అభివృద్ధి కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్న సీఎం జ‌గ‌న్

క‌డ‌ప జిల్లా ప్ర‌జ‌లు త‌న‌ని గుండెల్లో పెట్టుకుని చూసుకున్నార‌ని సీఎం వైఎస్ జ‌గ‌న్ అన్నారు. జిల్లాలోని ప్రొద్దుటూరులో ప‌లు అభివృద్ధి కార్య‌క్ర‌మాల్లో జ‌గ‌న్ పాల్గొన్నారు. ఇటీవ‌ల కురిసిన భారీ వ‌ర్షాల వ‌ల్ల నిరాశ్ర‌యులైన వారిని ఆదుకొంటామ‌న్ని జ‌గ‌న్ హామీ ఇచ్చారు. పెన్నానదిపై బ్రిడ్జి నిర్మాణానికి రూ.53 కోట్లు మంజూరు చేసినట్టుగా చెప్పారు. నియోజకవర్గ నాయకుల అభ్యర్థన మేరకు ప్రొద్దుటూరులో ఉర్దూ డిగ్రీ కాలేజీ మంజూరు చేస్తున్నామని జ‌గ‌న్ వెల్ల‌డించారు. ప్రొద్దుటూరులో 30 నెలల కాలంలో లబ్దిదారులకు రూ.326 కోట్లు నగదు బదిలీ చేసిన విషయాన్ని సీఎం గుర్తు చేశారు.

ఈ నియోజకవర్గంలో ఇళ్ల స్థలాల కోసం రూ. 200 కోట్లు మంజూరు చేశామన్నారు. 22 వేల ,212 మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశామ‌ని జ‌గ‌న్ వెల్ల‌డించారు. కోర్టు కేసులను పరిష్కరించుకుని, ఇళ్ల నిర్మాణం వేగవంతం చేశామన్నారు.ప్రొద్దుటూరులో తాగునీటి పైప్‌లన్నీ శిథిలావస్థకు చేరుకున్నాయన్నారు. డ్రైనేజీ వ్యవస్థను ఆధునీకరిస్తున్నామని అన్నారు. ఇందుకు రూ.163 కోట్లు కేటాయించామన్నారు. 171 కిలోమీటర్ల పొడవైన అధునాతన పైపు లైను ఏర్పాటు చేస్తున్నామని జ‌గ‌న్ వివరించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement