Tuesday, April 30, 2024

ఫోన్ దొంగిలించాడని ఫిషింగ్ బోట్ లో తలకిందులుగా వేలాడదీశారు..

మొబైల్ ఫోన్ దొంగిలించాడనే ఆరోపణతో ఒక మత్స్యకారుడు( వైలా శీను)ని ఫిషింగ్ బోట్‌లో తలకిందులుగా వేలాడదీసి ఓ మత్స్యకారుల గ్యాంగ్ దాడి చేసింది. ఈ సంఘ‌ట‌ర డిసెంబర్ 15న బందూర్‌లోని మంగళూరు ఫిషింగ్ హార్బర్‌లో ఫిషింగ్ బోట్‌లో జరిగింది. కాగా దొంగతనానికి పాల్పడ్డ వ్యక్తిపై మత్స్యకారుల గ్యాంగ్ దాడి చేసిన వీడియో వైరల్ కావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ వీడియో క్లిప్‌లో వైలా శీనుని వేయింగ్ మెషీన్‌కు ఉండే హుక్ తో తలక్రిందులుగా వేలాడతీసి కాళ్ల నుంచి న‌డుము వ‌ర‌కు తాళ్ల‌తో క‌ట్టేసిన‌ట్ట‌టు ఉంది. కాగా ఈ కేసులో మొత్తం ఆ గ్యాంగ్ కి చెందిన‌ ఆరుగురుని అటెమ్ట్ మర్డ‌ర్ కేసులో నిన్న రాత్రి అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఈ కేసులో విచారణ కొనసాగుతోందని పోలీసులు వివ‌రించారు..

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement