Friday, April 26, 2024

డెంగ్యూ .. టీబీకి వ్యాక్సిన్ .. ఎప్పుడంటే ..

కేంద్ర ప్ర‌భుత్వం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది..డెంగ్యూ , టీబీకి త్వ‌ర‌లోనే వ్యాక్సిన్లు రానున్నాయి. రాజ్య‌స‌భ‌లో విజ‌య‌సాయి రెడ్డి ప్ర‌శ్న‌కు కేంద్ర ఆరోగ్య‌శాఖ మంత్రి మ‌న్సుఖ్ మాండ‌వియ వివ‌ర‌ణ ఇచ్చారు. అమెరికాలో 9 నుంచి 16 ఏళ్ళ మధ్య పిల్లల కోసం డెంగ్యూ వాక్సిన్‌ అందుబాటులోకి వచ్చిందన్నారు. భారత్‌లో కూడా డెంగ్యూ నివారణకు ఈ తరహా వాక్సిన్‌ తీసుకువచ్చే అవకాశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందా అని నేటి రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో వి.విజయసాయి రెడ్డి ప్రశ్నించారు . ఆ ప్రశ్నకు కూడా జవాబు ఇచ్చారు ఆరోగ్య శాఖ మంత్రి. కేంద్ర ప్రభుత్వం టీబీ, డెంగ్యూ జబ్బులకు వాక్సిన్లను అభివృద్ధి చేస్తోందని తెలిపారు. వాక్సిన్‌ నిపుణుల ఆమోదం, సిఫార్సుల అనంతరం ఈ రెండు వాక్సిన్లను ప్రభుత్వం ప్రజలకు అందుబాటులోకి తెస్తుందని స్ప‌ష్ట‌త‌నిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement