Tuesday, May 7, 2024

Second Case: ఢిల్లీలో ఒమిక్రాన్ కలకలం.. భారత్ లో 33కి చేరిన కేసులు

భారత్ లో ఒమిక్రాన్ కలకలం రేపుతోంది. కరోనా కొత్త వేరియెంట్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. తాజాగా ఢిల్లీలో రెండో ఒమిక్రాన్ వేరియంట్ రెండో కేసు నమోదైంది. కొత్త వేరియంట్ బారినపడ్డ వ్యక్తి జింబాంబ్వే నుంచి వచ్చినట్లు అధికారులు ప్రకటించారు. ఆ వ్యక్తి పూర్తిగా వ్యాక్సిన్‌ వేయించుకుని జింబాబ్వే నుంచి వచ్చాడు. బాధితుడు దక్షిణాఫ్రికాలోనూ పర్యటించాడు. తాజా కేసుతో దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 33కి చేరింది. ఒమిక్రాన్ బాధితుడు ప్రస్తుతం ఎల్‌ఎన్‌జెపి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

కాగా, గత ఆదివారం, టాంజానియా నుండి ఢిల్లీకి వచ్చిన 37 ఏళ్ల పూర్తిగా వ్యక్తి ఒమిక్రాన్ ఉన్నట్లు గుర్తించిన సంగతి తెలిసిందే. దేశంలో ఇప్పటివరకు ఢిల్లీసహా మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, కర్ణాటకలో ఒమిక్రాన్ కేసులు నమోదైయ్యాయి. మహారాష్ట్రలో అత్యధిక ఒమిక్రాన్ కేసులను గుర్తించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement