Thursday, May 2, 2024

ఢిల్లీ లిక్కర్ స్కామ్ దర్యాప్తు ఈడీ దూకుడు

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దూకుడు పెంచింది. ఢిల్లీ కొత్త ఎక్సైజ్ విధానంలో అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఆ కేసుతో లింకు ఉన్న 35 ప్ర‌దేశాల్లో ఈరోజు ఈడీ అధికారులు త‌నిఖీలు చేస్తున్నారు. ఇప్ప‌టికే ఈ కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎం సిసోడియాను ఈడీ విచారించిన విష‌యం తెలిసిందే. స‌మీర్ మ‌హేంద్రు ఇంట్లోనూ సోదాలు జ‌రుగుతున్నాయి. గురుగ్రామ్‌, ల‌క్నో, హైద‌రాబాద్‌, ముంబై, బెంగుళూరులోనూ ఈడీ త‌నిఖీలు నిర్వ‌హిస్తున్న‌ట్లు తెలుస్తోంది. అలాగే ఢిల్లీ మాజీ ఎక్సైజ్ క‌మీష‌న‌ర్ అర‌వ గోపీ కృష్ణ ఇంట్లోనూ ఇటీవ‌ల ఈడీ సోదాలు చేప‌ట్టింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement