Tuesday, April 30, 2024

పంజాబ్ లో త‌మ పార్టీకి 52శాతం ఓట్లు వ‌స్తాయ‌న్న సీఎం ‘కేజ్రీవాల్’

పంజాబ్ సీఎం చ‌ర‌ణ్ జిత్ చ‌న్నీ ఈసారి ఎమ్మెల్యేగా కూడా గెల‌వ‌డ‌ని జోష్యం చెప్పారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. చన్నీ కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవలేకపోతే, పంజాబ్ కు ఇంకెవరు సీఎం అవుతారు అని ప్రశ్నించారు. చంకౌర్ నియోజకవర్గంలో ఆమ్ ఆద్మీ పార్టీకి 52 శాతం ఓట్లు వస్తాయని, భదౌర్ లో 48 శాతం ఓట్లు లభిస్తాయని చెప్పారు. ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్ లో జ‌ర‌గ‌నున్న అసెంబ్లీ స్థానంపై క‌న్ను వేసింది. ఇక పంజాబ్ ప్ర‌జ‌ల నుంచి టెలిపోల్ ద్వారా అభిప్రాయ‌సేక‌ర‌ణ చేశారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. ఈ టెలిపోల్ ఫలితాలను కేజ్రీవాల్ నేడు వెల్లడించారు. చన్నీ ఈ అసెంబ్లీ ఎన్నికల్లో చంకౌర్ సాహిబ్, భదౌర్ నియోజకవర్గాల్లో బరిలో దిగుతున్నారని, ఈ రెండు స్థానాల్లో ఆయన ఓడిపోతారని వివరించారు. తాము మూడుసార్లు సర్వే నిర్వహించామని కేజ్రీవాల్ వెల్ల‌డించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement