Thursday, May 16, 2024

Delhi : ల‌క్ష‌మందితో ఆమ్ ఆద్మీ మ‌హార్యాలీ.. వేదిక వద్ద పారామిలట‌రీ బ‌ల‌గాలు

ట్రాన్స్ ఫ‌ర్ పోస్టింగ్ ఆర్డినెన్స్ కి వ్య‌తిరేకంగా నేడు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సార‌థ్యంలో ఆమ్ ఆద్మీ ల‌క్ష‌మందితో మ‌హార్యాలీని చేప‌ట్ట‌నుంది. ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో నిర్వహించనున్న ఈ ర్యాలీకి లక్షమంది హాజరవుతారని ఆప్ వర్గాలు తెలిపాయి. ఆప్ మహారాల్యీ నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. స్థానిక పోలీసులతోపాటు 12 కంపెనీల పారామిలిటరీ బలగాలను వేదిక వద్ద మోహరించింది. ఈ ర్యాలీకి ఢిల్లీ ప్రజలు పెద్ద ఎత్తున హాజరు కావాలని కేజ్రీవాల్ పిలుపునిచ్చారు. ర్యాలీ నేపథ్యంలో ఈ ఉదయం 8 గంటల నుంచి పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. కేంద్రం తీసుకొచ్చిన కొత్త ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా తమకు అండగా నిలవాలని కోరుతూ కేజ్రీవాల్ ఇప్పటికే బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, బీహార్ సీఎం నితీశ్ కుమార్, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, శివసేన (యూబీటీ) నేత ఉద్ధవ్ థాకరే, సీపీఎం నాయకుడు సీతారాం ఏచూరి, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ వంటి వారిని కలిశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement