Friday, May 3, 2024

మినీ బస్సు బోల్తా.. ఏడుగురికి గాయాలు..

ఏలూరు, ప్రభ న్యూస్ క్రైమ్ : 16వ నెంబర్ జాతీయ రహదారిపై దెందులూరు మండలం సత్యనారాయణపురం వద్ద మినీ బస్సు బోల్తాపడి ఏడుగురికి గాయాలయ్యాయి. నెల్లూరు నుంచి అన్నవరం వెళుతున్న బస్సు ముందు వెళ్తున్న వాహనాన్ని తప్పించబోయి అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో ప‌లువురికి తీవ్ర గాయాల‌య్యాయి. దీంతో గాయపడిన వారిని హైవే పెట్రోలింగ్ పోలీసులు ఏలూరు ఆశ్రమ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement