Wednesday, May 22, 2024

నా ప్రియ మిత్రుడు షింజో అబేపై జ‌రిగిన దాడితో తీవ్ర మ‌నోవేద‌న‌కు గుర‌య్యా – ప్ర‌ధాని మోడీ

నా ప్రియ మిత్రుడు ..జ‌పాన్ మాజీ ప్ర‌ధాని షింజో అబేపై జ‌రిగిన దాడితో తీవ్ర మ‌నోవేద‌న‌కు గుర‌య్యాన‌ని ప్ర‌ధాని మోడీ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. తామంతా అతని కుటుంబంతో.. జపాన్ ప్రజలతో ఉన్నామంటూ ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు. షింజో అబే పై నారా ప్రాంతంలో కాల్పులు జరిగినట్లు జపాన్ కు చెందిన ప్రముఖ వార్త సంస్థ పేర్కొంది. జపాన్ నగరంలోని ఓ వీధిలో ప్రసంగిస్తుండగా వెనుక నుంచి వచ్చిన ఓ దుండగుడు ఆయనపై దాడి చేసినట్లు పేర్కొంది. దీంతో ఆయన ఒక్కసారిగా కుప్ప కూలిపోయారు.ఈ సంఘటనలో ఆయన తీవ్రంగా గాయపడినట్లు… ఆసుపత్రికి తీసుకువెళ్లే లోపే ఆయన మరణించినట్లు సమాచారం. నిందితుడిని శుక్రవారం.. పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.అబే తొలిసారిగా 2006లో జపాన్ ప్రధాన మంత్రిగా పనిచేశారు. అయితే కొన్ని వివాదాల కారణంగా ఒక సంవత్సరం పదవిలో ఉన్న తర్వాత పదవీ విరమణ చేశారు. ఆబే పై జరిగిన దాడిని ఖండించారు భారత ప్రధాని నరేంద్ర మోడీ.

Advertisement

తాజా వార్తలు

Advertisement