Monday, April 29, 2024

TS | నేడు నిమ్స్ లో కొత్త బ్లాక్​ నిర్మాణానికి కేసీఆర్​ శంకుస్థాప‌న‌

హైదరాబాద్ – తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని నేడు తెలంగాణ వైద్య దినోత్సవాన్ని నిర్వహించనున్నారు. నిజాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్)లో అత్యాధునిక 2000 పడకల సూపర్ స్పెషాలిటీ కొత్త బ్లాక్ కు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయ‌నున్నారు . రూ.1571 కోట్లతో చేపట్టనున్న ఈ బ్లాక్ లో మొత్తం 2000 పడకలు ఉండనున్నాయి

కాగా, తెలంగాణలోని 24 జిల్లాల్లో గర్భిణుల కోసం కేసీఆర్ పౌష్టికాహార కిట్ల విస్తరణ తెలంగాణ వైద్య దినోత్సవ వేడుకల్లో ప్రధాన కార్యక్రమాలుగా ఉన్నాయి. తృతీయ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు, ఏరియా, జిల్లా ఆసుపత్రులు మొదలుకొని సబ్ సెంటర్లు, పీహెచ్ సీలు, బస్తీ, పల్లె దవాఖానలు సహా అన్ని ప్రభుత్వ ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు తెలంగాణ వైద్య దినోత్సవ వేడుకల్లో పాల్గొని తెలంగాణ ప్రభుత్వం ఆవిర్భావం నుంచి చేపడుతున్న ప్రజారోగ్య సంరక్షణ కార్యక్రమాలపై అవగాహన కల్పించే కార్యక్రమాలను నిర్వహించనున్నాయి..

Advertisement

తాజా వార్తలు

Advertisement