Wednesday, May 15, 2024

Suryapet : పిల్లలమర్రి శివాలయాల్లో.. జిల్లా జడ్జి పూజలు

సూర్యాపేట : మున్సిపల్ పరిధిలోని పిల్లలమర్రి శివాలయాల్లో సూర్యాపేట జిల్లా జడ్జ్ రాజగోపాల్ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. ఎరకేశ్వర స్వామి, నామేశ్వర స్వామి, శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయాలను సందర్శించారు. దేవాలయాల చారిత్రక చరిత్రను అడిగి తెలుసుకున్నారు. అర్చకులు దేవాలయ చిత్ర పటాన్ని అందించి సన్మానించి ఆశీర్వచనం చేశారు. ముందుగా శివాలయ కమిటీ చైర్మన్ జేరిపోతుల భిక్షం, చెన్నకేశవస్వామి దేవాలయ కమిటీ సభ్యులు రాపర్తి మహేష్ లు పుష్పగుచ్చాన్ని అందజేసి స్వాగతం పలికారు. కార్యక్రమంలో అర్చకులు ముడుంబై రఘువరన్ ఆచార్యులు, మునగలేటి సంతోష్ శర్మ, సిబ్బంది ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement