Monday, April 29, 2024

Flash: నిజామాబాద్ లో నడిరోడ్డుపై గుట్టలుగా చిరిగిన నోట్లు!

నిజామాబాద్ జిల్లాల్లో చిరిగిన కరెన్సీ నోట్లు కలకలం రేపాయి. హైదరాబాద్-నాగపూర్ జాతీయ రహదారిపై నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం బుస్సాపూర్ వద్ద చిరిగిన కరెన్సీ నోట్లు కుప్పలు కుప్పలుగా పడి ఉన్నాయి. నడిరోడ్డుపై గుట్టలుగా పడివున్న వాటిని చూసి ప్రజలు షాకయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. చిరిగిన నోట్లు అక్కడికి ఎలా వచ్చాయి? తుక్కుగా ఎలా మారాయి? అన్న కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. నోట్లు అసలైనవా? లేక, నకిలీవా? అని పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇది బ్లాక్ మనీ లేదా నకిలీ నోట్లు కావచ్చు అని అనుమానం వ్యక్తం చేశారు. జాతీయ రహదారిపై సీసీ టీవీ ఫుటేజ్ పరిశీలిస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement