Friday, May 3, 2024

దళితరత్నకు – ఎంపికైన బైండ్ల బిచ్చన్న

మోమిన్ పేట..(ప్రభన్యూస్) సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా  పాల్గొన్న యువకులను గుర్తించి తెలంగాణ ప్రభుత్వం దళితరత్న అవార్డును ఇవ్వడం వల్ల తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కు ఎంతో రుణపడి ఉంటానని ..దళిత అవార్డు గ్రహిత
బైండ్ల బిచ్చన్న అన్నారు. అంబేద్కర్ జయంతి సంధర్బంగా హైదరాబాద్ నగరంలోని రవీంద్ర భారతిలో జరిగిన అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో అంబేడ్కర్ యువసేన వ్యవస్థాపక అధ్యక్షులు జే.బి.రాజు, రాష్ట్ర కన్వీనర్ జర్రిపోతుల పరుశురాం చేతుల మీదుగా అవార్డును అందుకోవడం నాకు గర్వకారణమన్నారు. వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్, మెతుకు ఆనంద్ నా సేవలను గుర్తించి అవార్డు రావడం కోసం కృషిచేసినందుకు ప్రతేకంగా ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement