Saturday, May 18, 2024

సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా సాంబశివరావు ఎన్నిక

సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఎన్నికయ్యారు. రాష్ట్ర కార్యదర్శి పదవికి ఆ పార్టీ నేత పల్లా వెంకట్‌రెడ్డి, సాంబశివరావు పోటీ పడ్డారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో నిర్వహించిన సీపీఐ 3వ రాష్ట్ర మహాసభల్లో బుధవారం ఈ ఎన్నికపై అర్ధరాత్రి వరకూ వాడివేడి చర్చలు జరిగాయి. ఇద్దరు నేతలూ పట్టువీడకపోవడంతో హైడ్రామా నడుమ ఓటింగ్‌ నిర్వహించారు. మొత్తం 110 ఓట్లు పోలయ్యాయి. ఇందులో సాంబశివరావుకు 59, పల్లా వెంకట్‌రెడ్డికి 45 ఓట్లు రాగా, మరో ఏడు ఓట్లు చెల్లకుండా పోయాయి. దీంతో కూనంనేని సాంబశివరావు విజయం సాధించినట్లు పార్టీ వర్గాలు ప్రకటించాయి. సీపీఐ 3వ మహాసభ వరకు రాష్ట్ర సహాయ కార్యదర్శిగా పనిచేసిన ఆయన కూనంనేని సాంబశివరావు గతంలో కొత్తగూడెం ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement